సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ముంబై చెక్కేసింది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తన ఫొటోలతో అందాల విందు చేస్తూ కుర్రకారుకు మతులు పోగొడుతుంది.
ఇండస్ట్రీ కి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఈ అమ్మడికి అడపా దడపా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
అయితే ఇంతకు ముందు ఈ అమ్మడు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.
కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో చిన్న హీరోలతో కూడా నటిస్తూ వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు.ఇక బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి బాగానే అవకాశాలు వస్తున్నాయి.
అక్కడ కూడా వరుస ఆఫర్లను పడుతుంది ఈ పంజాబీ ముద్దు గుమ్మ.
ప్రెసెంట్ రకుల్ బాలీవుడ్ లో చేస్తున్న సినిమాల్లో అజయ్ దేవగన్ సినిమా కూడా ఉంది.ఈయన సినిమాలకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలుసు.ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాల్లో మేడే సినిమా ఒకటి.ఇంతక ముందే వీరిద్దరూ కలిసి నటించారు.‘దే దే ప్యార్ దే‘ సినిమాతో తొలిసారి 2019లో నటించి ప్రేక్షకులను అలరించారు.
అయితే వీరిద్దరూ ఇప్పుడు చేస్తున్న మేడే సినిమా టైటిల్ మారిపోయినట్టు స్వయంగా అజయ్ దేవగన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఈ సినిమా టైటిల్ ను ‘రన్వే34′ గా మారుస్తున్నట్టు అజయ్ తెలిపాడు.అయితే ఎందుకు టైటిల్ చేంజ్ చేస్తున్నారో తెలపలేదు.ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.రకుల్, అమితాబ్ ఇద్దరు ఈ సినిమాలో పైలెట్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను స్వయంగా అజయ్ దేవగన్ డైరెక్ట్ చేస్తున్నాడు.
త్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న రిలీజ్ కాబోతుంది.