బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం కంటెస్టెంట్ ల ఫ్యామిలీ మెంబర్స్ రాకతో మరింత సందడి సందడిగా సాగింది.కానీ 12 వ వారం ఎలిమినేషన్ ఎవరు ఊహించని విధంగా షాకింగ్,అన్ పెయిర్ ఎలిమినేషన్ జరిగింది.
ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులపై రవి అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.అదేవిధంగా ప్రియాంక, కాజల్, సిరిల కంటే రవికి ఏ విధంగా ఓట్లు తక్కువగా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.
ఇదంతా ఒకవైపు అయితే దీప్తి సునైనా, షణ్ముఖ జస్వంత్ ఒక వైపు.
ఇటీవలే దీప్తి సునైనా బిగ్ బాస్ స్టేజి పైకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే.
ఇక తన ప్రియురాలిని చూసిన షణ్ముఖ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన దీప్తి సునైనా తన ప్రియుడు షణ్ముఖ్ కి ఏవో సిగ్నల్ ఇచ్చింది అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేయగా.
దానిపై స్పందించిన ఆమె మీ బొందరా మీ బొంద అలాంటి పనులు నేను చేయను అంటూ కాస్త ఘాటుగా స్పందించింది.
ఇక బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత దీప్తి సునైనా కేవలం తన ప్రియుడు షణ్ముఖ్ తో మాత్రమే మాట్లాడింది.మిగతా కంటెస్టెంట్ ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.దీనితో యాటిట్యూడ్ అంటూ ఆమెపై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన దీప్తి సునైనా.మరిచిపోయాను.
యాటిట్యూడ్ కాదు.పోయి పోయి అక్కడ చూపిస్తానా? అంటూ క్లారిటీ ఇచ్చింది.నాకు సమయం ఎక్కువగా లేకపోవడంతో, షణ్ముఖ్ తో మాత్రమే మాట్లాడి బయటకు వచ్చేసాను.బయటకు వచ్చిన తర్వాత నాకు గుర్తుకు వచ్చింది నేను ఎవరితో మాట్లాడట్లేదు అని.అక్కడ మరిచిపోయాను ఇప్పుడు చెబుతున్నా మా అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు అందరికీ థాంక్స్.అలాగే షణ్ముఖ్ ని చాలా రోజుల తర్వాత చూసేసరికి ఏం మాట్లాడాలో తెలియక వచ్చేసాను.
నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా? అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.