ఏపీలో జగన్ అడ్డా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కడప జిల్లా మాత్రమే.ఎందుకంటే మొదటి నుంచి ఇక్కడ వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట.వారు చెప్పిందే ఇక్కడ శాసనం అన్నట్టు సాగుతోంది.వారు చెప్పిన నేతలే ఇక్కడ నిలబడుతారు.వారు మెచ్చిన నాయకులకే పదవులు ప్రజలు కట్టబెడుతారు.అందుకే జగన్కు మొదటి నుంచి కడప జిల్లా అంటేఅంత ప్రేమ.
ఇక 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి జగన్కు కానుకగా ఇచ్చారు ఇక్కడి ప్రజలు.ఇంత భారీ మెజార్టీ అంటే మామూలు విషయం కాదు.
అయితే ఇప్పుడు జగన్కు ఓ చిక్కు వచ్చి పడింది.
అది కూడా ఓ నేత విషయంలో.
ఆయన్ను జగన్ దూరం పెట్టడంతో ఇప్పుడు ఆయనే జగన్కు షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.పైగా ఆయన ఎవరో కాదండోయ్.
జగన్కు ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థి అయినా 2019లో జగన్ పార్టీలో చేరి ఆయనకు సపోర్టుగా ఉన్నారు.అయితే ఆయనకు ఎలాంటి పదవి అయినా ఇస్తారేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు.
కానీ తనకు కాకుండా ఇదే జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యను రీసెంట్ ఎమ్మెల్సీ ఇచ్చారు.దాంతో పాటే గోవిందరెడ్డికి కూడా మరోసారి ఎమ్మెల్సీ కట్టబెట్టారు జగన్.
కానీ డీఎల్ కు మాత్రం అవకాశం ఇవ్వలేదు.
దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంట.తనకు ఇవ్వకుండా ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో ఆయన జగన్ మీద ఆగ్రహంగా ఉన్నారని అందుకే మొన్న ప్రస్ మీట్ పెట్టి జగన్ సర్కార్ మీద విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది.
ఇక రాబోయే రోజుల్లో కూడా వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.వైసీపీలో ఉన్న తన మద్దతుదారులను, తనకు సపోర్టుగా ఉండే నేతలను వెంటబెట్టుకుని టీడీపీ బాట పడుతారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
అదే జరిగితే జగన్కు చిక్కులు తప్పవు.మరి ఆయన్ను జగన్ ఎలా బుజ్జగిస్తారో చూడాలి.