తెలంగాణలో రాజకీయాలు పెద్ద ఎత్తున అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలతో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది.అయితే వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఇటు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పెద్ద ఎత్తున రచ్చ సాగుతున్న విషయం తెలిసిందే.
వరి ధాన్యం విషయంలో చాలా వరకు కేంద్ర ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని కెసీఆర్ వ్యాఖ్యానిస్తుండగా కేంద్రం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనవద్దని చెబుతోందని కిషన్ రెడ్డి అభిప్రాయ పడుతున్నారు.ప్రస్తుతం బీజేపీది మాత్రమే తప్పు అనే విధంగా మాత్రమే ముఖ్యమంత్రి కెసీఆర్ పకడ్భందీగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.
అయితే తాజాగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో బీజేపీ పై పెద్ద ఎత్తున కెసీఆర్ మండిపడ్డ విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్ళ విషయంలో రైతులు చాలా కన్ఫ్యూజన్ గా ఉన్న పరిస్థితి ఉంది.ఈ సమయంలో కెసీఆర్ చేసిన కీలక ప్రకటనతో ఒకసారిగా రైతాంగం షాక్ ఇచ్చారని చెప్పవచ్చు.యాసంగి పంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని దయచేసి రైతులు వరి వేయవద్దని కెసీఆర్ విజ్ఞప్తి చేశారు.
అయితే బీజేపీ నేతలు మాత్రం కెసీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. అయితే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్లనివ్వకూడదనే ఉద్దేశ్యంతో కెసీఆర్ చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.
బీజేపీ పార్టీ మాత్రం కొనుగోళ్ళ విషయంలో బండి సంజయ్ చేసిన తప్పు ఇప్పుడు బీజేపీకి పెద్ద ఎత్తున గుదిబండలా మారిన పరిస్థితి ఉంది.ఈ విషయంపై ఇంకా మరికొన్ని రోజులు రగడ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
అంతేకాక ఇప్పటికే వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేమని చెబుతున్న తరుణంలో బీజేపీ పార్టీ ఎలా స్పందిస్తుందనేది చూడాల్సి ఉంది.