బాలీవుడ్ నటి యామీ గౌతమ్ మనందరికీ సుపరిచితమే.ఈమె తాజాగా నవంబరు 28న తన బర్త్ డే జరుపుకుంది.
ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో తన వివాహ బంధం గురించి పలు విషయాలను పంచుకుంది.గత ఏడాది ప్రముఖ దర్శకుడు నిర్మాత అయినా ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ క్రమంలోనే తమ వివాహ బంధం గురించి, తన భర్త గురించి పలు విషయాలను వెల్లడించింది.
వీరిద్దరికీ ఒక షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని ఆమె చెప్పుకొచ్చింది.
వారి పెళ్లిని హంగులు ఆర్భాటాలు లేకుండా అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య జరుపుకున్నామని తెలిపింది.ఆమె భర్త విలువలతో కూడిన వ్యక్తిత్వం అని, పనిని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసే విధానం అందరినీ ఆకర్షించేలా ఉంటుందని చెప్పుకొచ్చింది.
అలాగే తన పెళ్లి భారీ వేదికలో చేసుకోవడం తనకు ఇష్టం లేదని.
మీరు చేసే పనుల నుంచి మీకు గౌరవం లభిస్తుంది.కానీ ఇతరులకు మెప్పించాలి అంటే మన జీవితం సరిపోదని ఆమె తెలిపింది.ఏదేమైనప్పటికీ పెళ్లి చేసుకున్న తరువాత సంతోషంగా ఉండాలి ప్రస్తుతం మేము కూడా సంతోషంగా ఉన్నాం మా కుటుంబాలు కూడా ఆనందంగా ఉన్నాయి.
అలాగే మన సాంప్రదాయాలు నాకు చాలా ముఖ్యం.కరోనా లేకపోయినప్పటికీ మా పెళ్ళి ఇలానే ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా జరిగేది అంటూ యామి గౌతమ్ వివరించింది.