గత కొంతకాలంగా భారతదేశంలో జీవన వ్యయం లేదా కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరుగుతోంది.పెట్రోల్, డీజిల్, గ్యాస్ నుంచి నిత్యావసర సరుకుల ధరల వరకు ప్రతి ఒక్కటి భగ్గుమంటోంది.
దీనితో వేతన జీవులపై మరింత భారం పడుతోంది.చాలా మంది ప్రజలకు ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పులపాలవుతున్నారు.
పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ జీతాన్ని ఖర్చు పెట్టలేక నెలాఖరులోపే తమ పర్సులు ఖాళీ చేసుకుంటున్నారు.మళ్ళీ జీతం వచ్చే ఒకటో తారీఖు కోసం నెలంతా ఎదురు చూస్తున్నారు.
తీరా ఒకటో తారీఖు రాగానే చేతికందిన జీతం రెండు మూడు రోజుల్లోనే ఆవిరైపోతుంది.ఇదే విషయాన్ని ఒక తాజా సర్వే గణాంకాలతో సహా వెల్లడించి అందర్నీ పోయేలా చేస్తోంది.
ఈవై, రిఫైన్ అనే రెండు సంస్థలు కలిసి ఒక సర్వే నిర్వహించి ఉద్యోగుల జీతాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.ఈ సర్వేలో పాల్గొన్న ఉద్యోగులందరూ తమ జీతాలు నెలలో ఎన్ని రోజుల వరకు సరి పోతున్నాయో తెలియజేశారు.
80 శాతం మంది ఉద్యోగులు నెలాఖరులోపే తమ పర్సులు ఖాళీ పోతున్నాయని వాపోయారు.లక్షకు పైగా జీతం వచ్చే వారిలో 60 శాతం మంది తమ జీతం నెల చివరి వరకు సరిపోవడం లేదని తెలిపారు.34 శాతం మంది ఉద్యోగులు నెలలో మొదటి 15 రోజుల్లోపే తమ జీతం అంతా ఖర్చు అయిపోతుందని వెల్లడించారు.ఇక రూ.15,000 లేదా అంతకన్నా తక్కువ జీతం పొందే వారు ప్రతినెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.కేవలం 13 శాతం మంది మాత్రమే తమ వేతనంలో కొంత పొదుపు చేయగలుగుతున్నానని చెప్పారు.
నెల ఖర్చులకే జీతం చాలక.సొంతింటి కల నెరవేర్చుకోలేమోనని, పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని ఉద్యోగులు అసంతృప్తితో జీవనాన్ని సాగిస్తున్నారు.జీతం గురించి అడిగితేనే మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.అయితే పెరుగుతున్న ధరలకు తగ్గట్టుగా ప్రతినెలా ఒక బడ్జెట్ రూపొందించుకొని ముందుకు సాగాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఆడంబరాలకు వెళ్లకుండా అవసరం లేని వస్తువులు కొనకుండా పొదుపు పెద్దపీట వేయాలని చెబుతున్నారు.స్థోమతకు మించిన వస్తువులు కొనుగోలు చేసి ఈఎంఐ ఉచ్చులో పడవద్దని చెబుతున్నారు.