టీటీడీలో ఎప్పటినుండో ఓఎస్డీ గా పని చేస్తున్న డాలర్ శేషాద్రి గుండెపోటుతో ఈరోజు ఉదయం మరణించారు.టీటీడీ ఆధ్వర్యంలో విశాఖలో తలపెట్టిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఆయన ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 40 నిమిషాలకు.
హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపే.తుది శ్వాస గడపడం జరిగింది.75 సంవత్సరాల వయసు కలిగిన ఆయన 1978 నుంచి శ్రీవారి సేవలో ఉన్నారు.2007వ సంవత్సరంలో రిటైరైన ఆయనకి.సంబంధించిన వివిధ సేవలకు సమగ్రమైన అవగాహన రిటైర్ అయినా గాని.రాష్ట్రప్రభుత్వం ఓఎస్డీగా.నియమించి ఆయన సేవలను వాడుకుంటూ ఉంది.గతంలోనే డాలర్ శేషాద్రికి రెండు మూడు సార్లు గుండె పోటు రావడం తిరుపతిలోని ప్రముఖ వైద్య శాల స్విమ్స్ లో… ఆయనకు చికిత్స చేయడం జరిగింది.
ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయి నెల రోజుల పాటు చికిత్స తీసుకోగా బాగానే రికవరీ అయ్యారు.
తాజాగా మరోసారి గుండెపోటు రావడంతో.
ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు.రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్న వారితో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు.
తిరుమల తిరుపతి లో ఆలయ మరియు అడ్మినిస్ట్రేషన్ విభాగాలకు సంబంధించి అనేక విషయాలలో ఆయనకు మంచి పట్టు ఉండటంతో… రాష్ట్ర ప్రభుత్వం శేషాద్రి సేవలను బాగా ఉపయోగించుకోవటం పరిపాటి.ఇదిలా ఉంటే ఆయన మెడలో డాలర్ ఉండటంతో.
ఆభరణం తో డాలర్ శేషాద్రి గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచారు.ఆయన అసలు పేరు పాల శేషాద్రి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన టిటిడి ఉద్యోగిగా.ఉన్న డాలర్ శేషాద్రి.
గుండెపోటుతో మరణించడం తో ఈ వార్త తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.డాలర్ శేషాద్రి మరణం పట్ల చాలామంది సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.