స్టార్ హీరో సినిమా అంటే ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గురించి అందరికి తెలిసిందే.వారికి అనుకున్న టైం లో రావాల్సిన అప్డేట్ రాకుంటే వారు చేసే హడావిడి మాములుగా ఉండదు.
మొన్నటి వరకు ప్రభాస్ రాధే శ్యాం గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ యువి క్రియేషన్స్ మీద నెగటివ్ ట్రెండ్స్ చేశారు.ఇక లేటెస్ట్ గా ఆ లిస్ట్ లో మైత్రి మూవీ మేకర్స్ వచ్చి చేరింది.
వరస్ట్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ అని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.ప్రస్తుతం నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఇది కనిపిస్తుంది.
అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 1 రిలీజ్ మరో 3 వారాలే ఉండగా సినిమా ప్రమోషన్స్ అనుకున్న రేంజ్ లో చేయట్లేదు అని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.ఈ క్రమంలో మైత్రి మూవీ మేకర్స్ మీద నెగటివ్ ట్రెండ్స్ చేస్తున్నారు.
పుష్ప సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేయాలని ప్లాన్ చేశారు.ఇప్పటివరకు 4 సాంగ్స్ రిలీజ్ కాగా అవి సూపర్ హిట్ అయ్యాయి.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడం ఖాయమని అంటున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా శ్రీవల్లి పాత్రలో నటిస్తుందని తెలిసిందే.