ఈమధ్య కాలంలో హీరోయిన్లు గ్లామర్ ని మరింత పెంచుకునేందుకు ఎక్కువగా సర్జరీల వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలోనే పలువురు హీరోయిన్లు వారి అందాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే.తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని కూడా సర్జరీ చేయించుకున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇలా సర్జరీ చేయించుకునే క్రమంలోనే కొన్నిసార్లు ఆ సర్జరీలు ఫెయిల్ అవుతూ ఉంటాయి.ఇప్పటికే ఇలా పలువురు హీరోయిన్ల విషయంలో సర్జరీ తరువాత అందవిహీనంగా ఉంది అంటూ నెటిజన్స్ ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా దిశా పటానీని చూసిన నెటిజన్లు ఆమెను చూసి సర్జరీ చేయించుకుందని, దీంతో ఆమె ముఖం చూడలేనట్టు గా మారిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన అంతిమ్ సినిమా స్క్రీనింగ్ లో పాల్గొన్న ఈమె ఎల్లో టాప్, డెనిమ్ బాటమ్ తో మెరిసింది.ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అవుతుంది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు దిశా పటాని అందంలో ఏదో తేడాగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు దిశా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తోంది, ఆమె ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.