బుల్లితెరపై ఎన్నో రియాలిటీ షోలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఇలాంటి రియాలిటీ షోలలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్నటువంటి కేబీసీ 13 ఒకటి అని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనే కంటెస్టెంట్ లకు వివిధ రకాల ప్రశ్నలు అడుగుతూ కోటి రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని కల్పించారు.ఇప్పటి వరకు ఎంతోమంది ఈ కార్యక్రమంలో కోటి రూపాయలు గెలుచుకున్నారు.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమానికి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు హాజరవుతూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం హాజరయ్యారు.
తాజాగా ఈయన నటించిన సత్యమేవ జయతే 2 హీరో హీరోయిన్లు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు.
అయితే ఈ ప్రోమోలో జాన్ అబ్రహం అమితాబచ్చన్ ముందు కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వ్యక్తిగత విషయాల గురించి చర్చించిన జాన్, అమితాబచ్చన్ ఎంతో సరదాగా ప్రేక్షకులను సందడి చేశారు.
అనంతరం జాన్ అబ్రహం ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారింది.మరి అబ్రహం కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.