టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈయన మహేష్ బాబు నిర్మిస్తున్నటువంటి మేజర్ చిత్రంలో నటిస్తున్నారు.
తాజ్ హోటల్ లోని బాంబ్ బ్లాస్ట్ లో మరణించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.
అయితే గత కొద్ది రోజులగా ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు అయోమయ స్థితిలో ఉన్నారు.ఈ క్రమంలోనే అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడారు.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నేను నటిస్తున్నప్పటికీ భౌతికంగా నేను కనిపించినా మానసికంగా ఈ పాత్రలో నటిస్తున్నది అడివి శేష్ కాదని తెలిపారు.మేజర్ చిత్రం ద్వారా సందీప్ పాత్ర ద్వారా అతను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు.
ఈ చిత్రం ప్రతి ఒక్కరికి ఒక కథగా ఉంటుంది కానీ నాకు మాత్రం ఓ పాఠం అని అడివి శేష్ తెలిపారు.కేవలం సందీప్ ప్రాణాలు మాత్రమే కాకుండా అప్పట్లో ప్రజలను కాపాడటానికి వారి ప్రాణాలను పణంగా పెట్టిన ప్రతి ఒక్క వీరుడికి సలాం చేస్తున్నాం వారందరి వీరత్వానికి మా సినిమా ఒక ప్రతీకగా నిలబడాలని ఈ సందర్భంగా అడివి శేష్ మేజర్ చిత్రం గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.