యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్నాడు.ప్రస్తుతం రాధే శ్యాం రిలీజ్ కు రెడీ అవుతుండగా ఆదిపురుష్ కూడా షూటింగ్ పూర్తి చేశాడు ప్రభాస్.ఇక ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ సెట్స్ మీద ఉంది.2022 సమ్మర్ కల్లా ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుందని తెలుస్తుంది.ఈ రెండు సినిమాల తర్వాత సందీప్ వంగ తో ప్రభాస్ స్పిరిట్ సినిమా ప్లానింగ్ లో ఉంది.
ఆ సినిమాను కూడా ప్రభాస్ పాన్ ఇండియా అటెంప్ట్ గా చేస్తున్నాడు.
ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ ఉంటాడని లేటెస్ట్ టాక్.ప్రభాస్ స్పిరిట్ లో ప్రభాస్ తో పాటుగా మరో స్టార్ హీరో కూడా నటించే ఛాన్సులు ఉన్నాయట.
అది కూడా సందీప్ వంగ డైరెక్ట్ చేసిన కబీర్ సింగ్ లో నటించిన షాహిద్ కపూర్ ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని అంటున్నారు.మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రభాస్ తో షాహిద్ కపూర్ ఖచ్చితంగా ఈ కాంబో క్రేజీగా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు.ఎలాగు తన కథల మీద ఫుల్ కాన్ ఫిడెంట్ గా ఉండే సందీప్ వంగ ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.