పిగ్మెంటేషన్ లేదా మంగు మచ్చలు..
స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మందిని తీవ్ర వేదనకు గురి చేసే చర్మ సంబంధిత సమస్యల్లో ఇది ఒకటి.ఆహారపు అలవాట్లు, వాతావరణంలో వచ్చే మార్పులు, ఒత్తిడి, కాలుష్యం, శరీరంలో మెలనిన్ అనే ద్రవ్యం అధికంగా ఉత్పత్తి కావడం, హార్మోన్ ఛేంజస్ ఇలా రకరకాల కారణాల వల్ల చర్మంపై నల్లని లేదా గోదుమ రంగు మచ్చలు ఏర్పడడాన్నే హైపర్ పిగ్నెంటేషన్ అని అంటారు.
ఈ సమస్య బారిన పడిన వారు.ఆ మంగు మచ్చలను ఎలా నివారించుకోవాలో అర్థంగాక తెగ సతమతమైపోతుంటారు.
అయితే ఇప్పుడు చెప్పబోయే సహజ సిద్ధమైన ఇంటి చిట్కాను పాటిస్తే గనుక చాలా సులభంగా పిగ్మెంటేషన్ సమస్యకు బై బై చెప్పవచ్చు.మరి ఆ చిట్కా ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేయాలి.? ఎప్పుడు వాడాలి.? వంటి విషయాలపై ఏ మాత్రం లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.ముందుగా స్టవ్పై ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్, మూడు స్పూన్ల అవిసె గింజలు వేసుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు హీట్ చేస్తే జెల్లీగా మారుతుంది.
ఇప్పుడు ఈ మిశ్రమం గోరు వెచ్చగా అయిన తర్వాత పల్చటి క్లాత్తో జెల్ను వేరు చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల అవిసె గింజల జెల్, పావు స్పూన్ గ్లిజరిన్, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్, ఒక స్పూన్ ఆలోవెర జెల్, పావు స్పూన్ మొక్క జొన్న పిండి వేసుకుని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆపై ముఖాన్ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.ఐదారు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్గా చేస్తే గనుక మంగు మచ్చలు క్రమ క్రమంగా తగ్గి పోవడమే కాదు.చర్మం కాంతి వంతంగా మరియు మృదువుగా సైతం మారుతుంది.