ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ ధర విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఒకపక్క రాజకీయంగా మరోపక్క సినిమా పరంగా సంచలనాలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం విషయంలో వెనకడుగు వేయకుండా ఏపీ ప్రభుత్వం.
టిక్కెట్ ధరలను నియంత్రించే రీతిలో తీసుకున్న నిర్ణయం తో పాటు దానికి చట్టబద్ధత తీసుకొస్తూ వ్యవహరిస్తున్న తీరు పట్ల… ఇండస్ట్రీకి చెందిన చాలామంది పెద్దలు వ్యతిరేకిస్తూ ఉన్నారు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏపీలో భయంకరంగా కురుస్తున్న వర్షాలకు చిత్తూరు జిల్లాలో.
కట్టిన భవనాలు నదులు పంటపొలాలు నీట మునగడం తెలిసిందే.చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది.ఇటువంటి తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా.
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి దాదాపు 10 లక్షల రిలీఫ్ ఫండ్ ప్రకటించడం జరిగింది.ఈ నేపథ్యంలో తిరుపతి వరద సహాయక చర్యల నిమిత్తం ఈ విరాళాలు అందిస్తున్నట్లు గీతా ఆర్ట్స్ కార్యాలయ వర్గాలు తెలియజేశాయి.