1.ట్రావెల్ నిబంధనలు మార్చిన కెనడా
భారత ప్రయాణీకుల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.భారత్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ లేదా రాపిడ్ టెస్ట్ చేయించుకోవాలని తేల్చి చెప్పింది.
2.యూఏయి లో వరుణ్ ధావన్ కు అరుదైన గౌరవం
యూఏయి లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కు అరుదైన గౌరవం దక్కింది.ఆయనకు యూ ఏయి ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది.
3.మహిళా సాధికారిత పై వెబినార్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( నాట్స్ ) తాజాగా మహిళా సాధికారిత పై దృష్టి పెట్టింది.ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ ద్వారా వెబినార్స్ నిర్వహించింది.
4. స్వీడన్ ప్రధానిగా మగ్ధలినా అండర్సన్
స్వీడన్ ప్రధానిగా సోషల్ డెమోక్రాట్స్ నాయకురాలు మగ్దలినా అండర్సన్ ఎంపికయ్యారు.
5.పాసోలో ఉగ్ర దాడులు .19 మంది మృతి
ఆఫ్రికాలోని బుర్కినా ఫాసో లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు.
6.కరోనా పై డబ్ల్యూహెచ్ వో స్పందన
రాబోయే రోజుల్లో మరో 7 లక్షల మంది ప్రజలు కరోనా కు బలయ్యే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది.
7.అభినందన్ పై పాకిస్థాన్ కామెంట్స్
భారత వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ 16 ఫైటర్ జెట్ ను కూల్చివేశారు అనే వాదనలపై పాకిస్థాన్ స్పందించింది.అభినవ్ ఫైటర్ జెట్ ను కూల్చివేయలేదు అని ప్రకటించింది.
8.గూగుల్ కు ఉద్యోగుల డిమాండ్
వర్క్ ఫ్రమ్ హోం లో ఉద్యోగులకు వాక్సినేషన్ తప్పనిసరి అంటూ చేసిన పాలసీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు.వర్క్ ఫ్రమ్ హోమ్ ను మరికొంత కాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
9.మిస్టర్ బీన్ మరణ వార్త పై అభిమానుల ఆగ్రహం
మిస్టర్ బీన్ మరణించాడు అంటూ ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థ కథనం ప్రచారం చేయడం పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే ఆ వార్త కథనం తప్పు అని, తాను బతికే ఉన్నానని మిస్టర్ బీన్ ప్రకటించారు.