ప్రస్తుతం అంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.ఏదైనా విషయం ఏ మూల జరిగినా ఇట్టే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
ఒకప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే చాలా రోజుల సమయం పట్టేది.అంతేకాక అప్పుడు ఉన్న మాధ్యమాలు చాలా తక్కువ.
కానీ ఇప్పుడు సోషల్ మీడియాను వాడని వారు చాలా తక్కువ.రోజుకు పదిహేను నుండి పదహారు గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు మనకు దర్శనమిస్తుంటాయి.అయితే ఆ వీడియోలలో నెటిజన్లకు అత్యంత ఆసక్తి కలిగించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంటాయి.
తాజాగా ఓ వీడియో నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.ఈ వీడియోలో ఈ ప్రబుద్దుడు చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది.
మనిషి అనే వాడు ఇలా చేయడు అని మీరు ఈ వీడియో చూసిన తరువాత ఖచ్చితంగా అంటారు.ఇంతకు సదరు ప్రబుద్ధుడు చేసిన పనేంటంటే టర్కీలోని ఒక వ్యక్తి ఇస్తాంబుల్వెళ్లుతున్న ఒక బస్సు సీటులో కుక్క మలం ఉంచాడు.అయితే చాలా సైలెంట్ గా ఆ పని చేసి తన స్టాప్ రాగానే దిగేసి వెళ్ళిపోయాడు.అయితే ఎవరూ చూడలేదని అనుకున్నాడు కానీ సీసీ కెమెరా మాత్రం సదరు ప్రబుద్ధుని శాడిస్ట్ తనాన్ని బయటపెట్టింది.
అయితే మొదట వేరే ఏదైనా కుక్క చేసి ఉండవచ్చు అనుకున్నారు కానీ సీసీ కెమెరా చెక్ చేశాక చేసింది మనిషి అని తెలిసి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.
మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.