సాధారణంగా పెళ్ళిళ్ళు అంటే ఉండే సందడి ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.బంధువులు, చిన్న పిల్లలు, స్నేహితులు ఇలా అంతా సందడి సందడిగా ఉంటుంది కదా.
అయితే మనకున్న సాంప్రదాయాల ప్రకారం మన బంధువులు అంటే అత్తమ్మలు కావచ్చు, మామయ్యలు ఇలా ఇతర బంధు గణం ఎవరి స్తోమతకు తగ్గట్టు గిఫ్ట్ లు తెస్తుంటారు.అయితే రాజస్థాన్ లో జరిగిన ఓ పెళ్లిలో మేనమామ తన అల్లునికి ఇచ్చిన కానుకలను లెక్కించేందుకు ఏకంగా మూడు గంటల సమయం పట్టింది.
మూడు గంటల సమయం పట్టడానికి ఆ మేనమామ ఇచ్చినగిఫ్ట్ ఏంటో తెలుసా పది రూపాయల నోట్ల కట్టలను రెండు బస్తాలలో తీసుకవచ్చారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో అందరూ కలసి రెండు సంచుల్లో నగదును తీసుకొచ్చారు.
దీంతో ఒక్కసారిగా ఆ పెళ్లికి వచ్చిన అతిథులు ఆశ్చర్యపోవడం వారి వంతయింది.అయితే ఈ డబ్బులను ముగ్గురు కలసి గత రెండున్నారేళ్లుగా కూడబెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఆ తరువాత బంధువులు అంతా కలసి ఈ రెండు సంచులలో నింపిన డబ్బులను లెక్కపెట్టారు.ఈ వార్త ఇప్పుడు నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.
అసలు మేనమామ తన అల్లునికి ఇచ్చిన గిఫ్ట్ అదుర్స్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా ఆ పెళ్లి కొడుకు పెళ్లికి వచ్చిన ఏ గిఫ్ట్ అయినా మర్చిపోతాడేమో గాని తన మేన మామ ఇచ్చిన ఈ గిఫ్ట్ ను మాత్రం ఎప్పటికీ మరిచిపోరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇటువంటి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన రావడమే గ్రేట్ అని మరికొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నెటిజన్ల కామెంట్స్ తో ఈ వార్త నెట్టింట్లో మరింత వైరల్ గా మారుతోంది.