ఆడపిల్లలకు రానురాను రక్షణ లేకుండా పోతుంది.కంటికి రెప్పలా కాపాడు కోవాల్సిన తండ్రే తన కూతురు పట్ల కాల యముడిగా మారిపోయాడు.
తండ్రి బిడ్డలకు ఆదర్శంగా నిలవాలి.కానీ ఆ తండ్రే తప్పు చేస్తే.
తండ్రికి కూతుర్లకు ఒకరి పట్ల ఒకరికి ఎనలేని ఇష్టం ఉంటుంది.బయట ఎవరైనా ఏడిపిస్తే ఇంట్లో తన తండ్రికి చెప్పుకుని దైర్యంగా ఉంటుంది ఆడపిల్ల.
కానీ ఆ తండ్రే కూతురు పట్ల చెప్పుకోలేని విధంగా ప్రవర్తిస్తే ఇక ఆ కూతురు ఎవరికీ చెప్పుకోవాలి.అలాంటి ఆడపిల్లల బాధ వర్ణనాతీతం.తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బెంగుళూర్ లో చోటు చేసుకుంది.తండ్రి వేధింపులు తట్టుకోలేక ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది.
పుట్టినప్పటి నుండి 17 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి చేసిన వేధింపులు భరించిన ఆ యువతి ఇక భరించలేక కన్న తండ్రినే హతమార్చింది.
బీహార్ కు చెందిన దీపక్ కుమార్ సింగ్ (46) అనే వ్యక్తి బెంగుళూరులో పని చేస్తున్నాడు.
అతడికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.భార్య మృతి చెందింది.
దీంతో అతడు కూతుర్లతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు.ఇక భార్య కూడా లేకపోవడంతో అతడి ఆగడాలకు అంతు లేకుండా పోయింది.
చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముగ్గురు ఆడపిల్లలను చిత్ర హింసలు పెడుతున్నాడు.
అతడి పెద్ద కూతురు 17 ఏళ్ళు భరించింది.
కానీ ఆమె ఓపిక నశించి అతడిపై కోపం పెంచుకుంది.ఈ బాధలన్నీ పోవాలంటే తండ్రిని చంపేయాలని నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని తన సోదరులకు, స్నేహితులకు కూడా తెలిపింది.
ఇక ఆదివారం అర్ధరాత్రి అతడు నిద్రిస్తున్న సమయంలో అతడిపై కత్తితో దాడి చేసింది.అతడు మరణించేంత వరకు కత్తితో పొడిచి చంపేశారు.
ఈ హత్యలో ఆమె సోదరులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు.ఆ తర్వాత వారందరూ కలిసి పరారయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపి బాలిక కోసం వెతుకుతున్నారు.