కరోనా కల్లోలం తర్వాత సినిమా పరిశ్రమ మరింత ఊపుతో ముందుకు వెళ్తోంది.కొత్త జోష్ తో పలు సినిమాల శరవేగంగా తెరకెక్కుతున్నాయి.
పెండింగ్ సినిమాలు సైతం అంతే వేగంగా కంప్లీట్ అవుతున్నాయి.విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి.
టాలీవుడ్ నుంచి దేశం అబ్బుర పడే సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లకు వచ్చేందుకు వేగంగా పనులు పూర్తి చేసుకుంటున్నాయి.
ఇప్పటికే వందకు వంద శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు జనాల ముందుకు వచ్చాయి.సినిమా మేకర్స్ కూడా భారీ స్థాయిలో సినిమా రిలీజులను ప్రకటిస్తున్నారు.
వచ్చే డిసెండర్, జనవరి నెలల్లో భారీ పాన్ ఇండియన్ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.ఇప్పటికే మస్త్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలు రిలీజ్ డేట్లను కూడా ప్రకటించాయి.
పుష్ప, శ్యామ్ సింగ రాయ్, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా రేంజిలో రిలీజ్ అవుతున్నాయి.
ఇప్పటికే పోస్టర్స్ తో పాటు వీడియో పాటలు విడుదల అయ్యాయి.
ఈ క్రేజీ సినిమాలకు సంబంధించి వచ్చే వారం అదిరిపోయే అప్ డేట్స్ వస్తున్నాయి.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ థర్డ్ సింగ్, ప్రభాస్ మూవీ రాధే శ్యామ్ సెకెండ్ సింగిల్, బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న అఖండ సినిమాకు సంబంధించి మూడో పాట రాబోతుంది.అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా పుష్ప ట్రైలర్ ప్రకటన కూడా వచ్చేవారంలో రానుంది.మొత్తంగా డిసెంబర్ నెల అంతా ఫ్యాన్స్ కు పండగ వాతావరణం రానుంది.
పలు సినిమాలు వరుసబెట్టి విడుదల అయ్యే అవకాశం ఉంది.
మొత్తంగా డిసెంబర్ మొదలుకొని జనవరి వరకు తెలుగు సినిమా పరిశ్రమ కొత్త సినిమాల విడుదలో మరింత జోష్ నింపుకోనుంది.కరోనా తర్వాత ఫ్యాన్స్ ఓ రేంజిలో ఎంటర్ టైన్ మెంట్ అందుకునేందు రెడీ అవుతున్నారు.ఇంతకీ ఏ సినిమా జనాలను ఏ రేంజిలో ఆకట్టుకుంటుంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.