తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొద్ది రోజులుగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు.క్రమ క్రమంగా తెలంగాణలో బిజెపి బలం పెంచుకుంటూ ప్రధాన ప్రత్యర్థిగా మారేందుకు ప్రయత్నిస్తూ ఉండటం, దుబ్బాక హుజురాబాద్ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థులు గెలవడం, టిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలు బలపడుతూ ఉండడం, ఇలా అనేక కారణాలతో కెసిఆర్ గత కొద్ది రోజులుగా టెన్షన్ గానే ఉన్నారు.
అందుకే బీజేపీని ఇరుకున పెట్టేందుకు రకరకాల ఉద్యమాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అలాగే పార్టీ కార్యకర్తలలోనూ మరింత ఉత్సాహం పెంపొందించి ఎన్నికల నాటికి మరింత ఉత్సాహంగా పని చేసే విధంగా చేసేందుకు టీఆర్ఎస్ విజయ గర్జన సభను ఉద్యమాలకు పుట్టినిల్లయిన వరంగల్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక నాయకులు అందరికీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.
ప్రతి ఒక్కరూ విజయ గర్జన సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని భారీగా జన సందోహం ఆ సభకు వచ్చేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే ముందుగా ఈ సభను మామునూరు రంగలీల మైదానంలో నవంబర్ 15 న నిర్వహించాలని భావించినా, 29న దీక్షా దివస్ రోజున అయితే బాగుంటుందని, ఆ తేదీకి మార్చారు.
ఈ సభ నిర్వహణకు వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా మడికొండ, దేవన్నపేట కాజీపేట ప్రాంతాలను పరిశీలించారు.చివరికి దేవన్నపేట లో ఈ నెల 5న నిర్వహించాలని చూశార.
కానీ తొమ్మిదో తేదీన ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 16వ తేదీన వెలువడతుండడంతో డిసెంబర్ 19వ తేదీన దేవన్నపేట శివారు లో నిర్వహించాలని ఫైనల్ గా డిసైడ్ అయ్యారు.దీనికోసం దాదాపు 20 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సభ ను సక్సెస్ చేసి తెలంగాణలో తన సత్తా చాటుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నారు
.