రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కలిసారు.విషయంలోకి వెళితే తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనుమరాలు స్నిగ్ధరెడ్డి పెళ్లి వేడుక.
శంషాబాద్ కొత్తగూడలోని వీఎన్ఆర్ ఫామ్స్ లో ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.ఈక్రమంలో వధూవరులను ఆశీర్వదించడానికి భారీ ఎత్తున సెలబ్రిటీలు అదే రీతిలో వివిధ పార్టీల రాజకీయ నాయకులతో పాటు సీఎం జగన్, కేసిఆర్ కూడా హాజరయ్యారు.
ముఖ్యంగా వరుడు రోహిత్ రెడ్డి. సీఎం జగన్ వద్ద ప్రత్యేక అధికారిగా పని చేస్తున్న కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు.
దీంతో ఇరువురు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడంతో పాటు జగన్ కెసిఆర్ పక్క పక్కనే కూర్చుని చాలాసేపు మాట్లాడుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సంచలనంగా మారింది.గతంలో ఢిల్లీకి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదం చేరిన క్రమంలో… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నువ్వానేనా అన్నట్టుగా వ్యవహరించారు.
అనంతరం ఆ జల వివాదం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకోవటం ఇదే ప్రథమం.