ఒకప్పుడు ఏదైనా విషయం తెలియాలంటే చాలా రోజుల సమయం పట్టే పరిస్థితి ఉండేది.ఎందుకంటే అప్పుడు రేడియోలు, ఒక న్యూస్ పేపర్ తప్ప వేరే మాధ్యమాలు లేవు కాబట్టి అంతగా ఏదైనా విషయం బయటికి వచ్చేది కాదు.
కాని ఇప్పుడు పరిస్థితి మాత్రం అప్పటి పరిస్థితి కంటే పూర్తి భిన్నంగా ఉంది.ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియా హవా నడుస్తోంది.
ఎక్కడ ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తోంది.అది కాస్త నెటిజన్ల కామెట్లతో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.
ఇలా వైరల్ గా మారిన చాలా వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలా చూస్తూ ఉంటాం.ఇక అసలు విషయానికొస్తే ఏనుగును చూడాలని, దానిని ఎక్కాలని చిన్న పిల్లల మొదలు పెద్ద వారి వరకు ఎంతో ఆసక్తి ఉంటుంది కదా.ఇంకా బుల్లి ఏనుగును చూస్తే ఇక ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది కదా.
అలా పెద్ద ఏనుగుల కంటే బుల్లి ఏనుగులు ఎంతో ముద్దుగా ఉంటాయి.తాజాగా ఓ తల్లి ఏనుగు ప్రక్కన బుల్లి ఏనుగు బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తోంది. ఐఎఫ్ ఏ అధికారి ప్రవీణ్ కాష్వాన్ ఫోటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
దీంతో ఈ ఫోటో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.నెటిజన్లు ఈ ఫోటోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.బుల్లి ఏనుగులు బుడి బుడి అడుగులు కొందరు కామెంట్స్ చేస్తుండగా ఇంత బుల్లి ఏనుగును ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ ఫోటోను తమ తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ మరింతగా వైరల్ చేస్తున్న పరిస్థితి ఉంది.
నెటిజన్లను ఎంతగానో ఆసక్తికి గురి చేసిన ఈ ఫోటోపై మీరూ ఓ లుక్కేయండి మరి.