హిందువులు తమ దేవుళ్లను ఎంతలా ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అత్యంత నిష్టతో నిత్యం పూజలతో దేవుళ్లను కొలుస్తారు.
ఆలయాల్లో అయితే పూజారులు నిత్యం దేవుడి విగ్రహాలను పూజా, కార్యక్రమాలతో అలంకిరిస్తుంటారు.ఎప్పటికప్పుడు కొత్త విధానాలతో పూజలు చేస్తూ ఆరాదించడం మనం చూస్తున్నాం.
అయితే ఇప్పుడు ఓ పూజారి ఏకంనా దేవుడి విగ్రహాన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది.అదేంటి దేవుడి విగ్రహం హాస్పిటల్ కు ఎందుకు అని అనుకుంటున్నారా.
అయితే ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది.
కృష్ణుడికి మన దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలటే ఏ మాత్రం కొంచెం పెద్ద ఊరు అయినా సరే కృష్ణుడి ఆలయాలు ఉంటాయి.ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో ఓ కృష్ణుడి ఆలయం ఉంది.
కాగా ఈ ఆలయంలోని కృష్ణుడి విగ్రహం చేతి విరిగిందని పూజారి ఏకంగా ఆస్పత్రికి విగ్రహాన్ని తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.యూపీలోని ఖేరియా మోడ్లో పత్వారీ ఆలయం ఎంతో ఫేమస్ గా ఇక్కడ గుర్తింపు పొందింది.
కాగా ఈ ఆలయంలోని విగ్రహానికి పూజారి లేఖ్ సింగ్ పూజ చేస్తుండటా సడెన్ గా విగ్రహం చేయి భాగం కాస్త పగిలినట్టు అయింది.
దీంతో ఆయన ఆగ్రా జిల్లా హాస్పిటల్కు విగ్రహాన్ని తీసుకుని వెళ్లారు.ఇక విగ్రహాన్ని డాక్టర్లుకు చూపించి వెంటనే దెబ్బతిన్న చోట కట్టుకట్టాలంటూ వేడుకున్నారు.అయితే డాక్టర్లు ఆయన చెప్పిన దాన్ని విని ఆశ్చర్యపోయారు.
పూజారికి ఏదో విధంగా నచ్చజెప్పాలని చూసినా ఆయన వినకపోవడంతో తప్పేది లేక వారు విగ్రహానికి ప్లాస్టర్ కట్టారు.ఇదే విషయాన్ని సూపరింటెండెంట్ అశోక్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు.
పూజారికి హృద్రోగ సమస్యలున్నాయని, అందుకే అతన్ని ఇబ్బంది పెట్టలేక ఇలా కట్టు కట్టి పంపించేశామని వెల్లడించారు డాక్టర్లు.
.