మెగాస్టార్ చిరంజీవి వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు.కుర్ర హీరలకంటే దూకుడుగా సినిమాల్లో నటిస్తున్నాడు.
ఒక సినిమా పూర్తికాక ముందే.మరో సినిమాకు కమిట్ అవుతున్నాడు.
తాజాగా మరో మూడు సినిమాలు సెట్స్ మీదకు వెళ్తున్నాయి.చిరు గతంలో ఒకే సమయంలో అనేక సినిమాలు చేశాడు.
కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ ఒకే సారి మూడు సినిమాలు చేయలేదు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో తన తనయుడు రాంచరణ్ తో కలిసి చిరంజీవి నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా కంప్లీట్ కాకముందే.
మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పాడు.దీనికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
అటు బాబీతో కలిసి మెగా154 చేస్తున్నాడు.మెహర్ రమేష్ తో కలిసి భోళా శంకర్ మూవీ చేస్తున్నాడు.
ఈ చిత్రాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ కొట్టిన వేదాళం సినిమాకు రీమేక్.ఈ సినిమా కోసం హైదరాబాద్ లో సెట్ వేశారు.ఇందులో ఈనెల వరకు షూటింగ్ కొనసాగుతుంది.
అటు డిసెంబర్ లో మెగా 154 సినిమా షూటింగ్ మొదలు కానుంది.ఈ షూటింగ్ ను చిరంజీవి మొదలు పెట్టనున్నాడు.మాస్ యాక్షన్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది.ఇందులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.బాబీ సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే గాడ్ ఫాదర్ సినిమా చేస్తాడు.
ఇలా ఒకే సమయంలో మూడు సినిమాలు చేయడం తాజాగా జరుగలేదు.దీంతో చిరంజీవి ప్రస్తుతం ఈ సినిమాలన్నింటినీ ఏక కాలంలో చేస్తున్నాడు.ఏ కుర్ర హీరోకు కూడా ప్రస్తుతం ఈ స్థాయి అవకాశాలు రావడం లేదు.
వయసు పెరుగుతున్న కొద్ది చిరంజీవికి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.అటు ఆచార్య సినిమా 2022 ఫిబ్రవరి 4న విడుదల కానుంది.
వచ్చే ఏడాదిలో చిరంజీవికి చెందిన రెండు సినిమాలు జనాలను అలరించే అవకాశం ఉంది.