తెలుగులో ఇటీవలే నూతన దర్శకుడు దామోదర్ దర్శకత్వం వహించిన పుష్పక విమానం చిత్రం విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే కాగా ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ ప్రముఖ హీరో ఆనంద్ దేవరకొండ నటించగా హీరోయిన్లుగా శాన్వి మేఘన, గీత్ సైనీ తదితరులు నటించారు అలాగే ఈ చిత్రంలో తెలుగు ప్రముఖ కమెడియన్ మరియు హీరో సునీల్, సీనియర్ హీరో నరేష్, కిరీటి, భద్రం, హర్ష వర్ధన్, వైవా హర్ష తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే పెళ్లి అయిన తరువాత పలు అనివార్య కారణాల వల్ల భార్య వెళ్లిపోవడంతో భర్త పడేటువంటి కష్టాలను దర్శకుడు దామోదర్ చూపిస్తూ ప్రేక్షకులని సరదాగా నవ్వించాడు.
దీంతో ఈ చిత్రం ప్రస్తుతం ప్రేక్షకులని బాగానే అలరిస్తూ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.అయితే ఇటీవలే ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా నటించిన గీత్ సైనీ ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.
ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఇంటర్వ్యూ లో భాగంగా సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరు కూడా సినిమా కోసం చాలా కష్ట పడ్డానని అందువల్లనే మంచి పాజిటివ్ టాక్ వచ్చిందని తెలిపింది.
ఇక ఈ చిత్రంలో తనకు అవకాశం ఎలా వచ్చిందనే విషయం గురించి ప్రస్తావిస్తూ తనకు నటన పై ఉన్నటువంటి ఆసక్తిని తన స్నేహితురాలు గమనించి తన ఫోటోలను పుష్పక విమానం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు పంపించిందని తెలిపింది.ఆ తర్వాత ఒక రోజు ఉన్నట్లుండి తనకు ఫోన్ కాల్ రావడంతో చాలా ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.
అలాగే అప్పటికే తాను కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు ఇలాంటి మంచి అవకాశం దక్కుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది.అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూడాలని పైరసీని ఎంకరేజ్ చేయొద్దని కోరింది.
అయితే పుష్పక విమానం తన మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం విడుదల అయ్యేదాకా ఇతర చిత్రాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిపింది.ఈ క్రమంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు సినిమా ఆఫర్లు వరించాయని అయినప్పటికీ తాను మాత్రం సినిమాలలో నటించేందుకు అంగీకరించిన లేదని స్పష్టం చేసింది.అయితే తాజాగా విడుదలైన పుష్పక విమానం చిత్రంలో మీనాక్షి పాత్రలో నటించిన గీత్ సైని తన నటనతో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.అలాగే సినిమా పరిశ్రమలో రెమ్యూనరేషన్ మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే గీత్ సైనీ కి మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.