పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.జనవరి 12న రిలీజ్ డేట్ అంటూ ప్రకటించినా ఆర్.
ఆర్.ఆర్, రాధే శ్యాం రెండు పాన్ ఇండియా సినిమాలు ఆ టైం లో వస్తుండటం తో భీమ్లా నాయక్ మేకర్స్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.ప్రస్తుతానికి పోటీలో ఉన్నట్టు చెబుతున్నా చివరి నిమిషంలో మాత్రం ఖచ్చితంగా భీమ్లా నాయక్ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారని అంటున్నారు.తెలుస్తున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ సినిమాను 2022 జనవరి 26న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.
అదే జరిగితే ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం లకు గట్టి పోటీ లేనట్టే.
మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ గా వస్తున్న భీమ్లా నాయక్ నాయక్ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.థమన్ అందిస్తున్న మ్యూజిక్ ఇప్పటికే ఫ్యాన్స్ కు బాగా ఎక్కేసింది.వకీల్ సాబ్ తర్వాత థమన్ పవన్ కళ్యాణ్ కు మరోసారి అదిరిపోయే ఆల్బం ఇచ్చాడని చెప్పొచ్చు.సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.