యూసఫ్ అలీ ఈ పేరు తెలియని ఎన్నారైలు ఉండరు ముఖ్యంగా దుబాయ్ దేశాలలో ఈ పేరు మారుమోగుతుంది.ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో యూసఫ్ అలీ వ్యాపారాలు ఉండగా వాటిపై ఆధారపడి ఉండే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది.
కేరళాకు చెందిన యూసఫ్ అలీ యూఏఈ లో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడ్డారు.ఎన్నో వ్యాపారాలు చేస్తూ టాప్ 100 భారత సంతతి వ్యాపార వేత్తలల్లో 2018 లో మొదటి వరుసలో నిలిచారు.
యూఏఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాపార, వాణిజ్య బోర్డులో కీలక సభ్యుడిగా నియమించబడ్డారు అలీ.అలాగే
యూఏఈ ప్రభుత్వం తమ దేశ అభివృద్దిలో కీలకంగా వ్యవహరిస్తూ , విశిష్ట సేవలు అందించిన ఎన్నారైలకు గోల్డెన్ వీసాలు అందిస్తున్న క్రమంలో వ్యాపార రంగంలో యూఏఈ లో అత్యంత కీలక పాత్ర పోషిస్తూ, యూఏఈ ప్రజలకు ఉపాది కల్పించిన అలీని ఆదేశం 10ఏళ్ళ పాటు అర్హత కలిగిన గోల్డెన్ వీసాతో సత్కరించుకుంది.తన కంపెనీ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందించారు.ఎన్నో స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టారు అలీ.ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో తన వ్యాపార సామ్రాజ్యం విస్తరించిన అలీ ఇండోనేషియా వ్యాపార రంగంలో తిరుగులేని వ్యక్తిగా నిలిచారు.
ఇండోనేషియాలో ఆయన వ్యాపారాల విస్తరణ చేపట్టడంతో ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది పొందటంతో అక్కడి ప్రభుత్వం యూసఫ్ అలీ తమ దేశంలో చేస్తున్న సేవలకు గుర్తింపు ఇచ్చింది.
ఇండోనేషియా అభివృద్ధికి వ్యాపార, వాణిజ్య రంగాలలో ఆయన చేసిన విశేష కృషికి అక్కడి అత్యున్నత పురస్కారమైన ప్రేమదూత అవార్డు ను అందించింది.ఈ మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన యూసఫ్ అలీ భవిష్యత్తులో మరిన్ని వ్యాపారాలు ఏర్పాటు చేస్తానని తనకు ఈ అవార్డ్ అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.