టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరుగా ఉన్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎందుకంటే అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు పంచుకుంది.
ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన సమంత మంచి సక్సెస్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుంది.తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.కానీ ఇటీవలే వీరిద్దరు విడిపోయి తమ కొత్త జీవితాలను ప్రారంభించారు.
ప్రస్తుతం సమంత శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేయగా బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకున్నట్లు తెలుస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకుంది.మార్వెల్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ నుండి తెరకెక్కనున్న ఎటర్నల్స్ సినిమా గురించి పంచుకుంది.ఈ సినిమా అన్ని భాషలలో నవంబర్ 5న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సమంత ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుంది.మనం అవెంజర్స్ ని ఎంతగానో ప్రేమించాం, ఆదరించాం.ఇప్పుడు కొత్త సూపర్ హీరోల సమయం వచ్చిందని.ఎటర్నల్స్ మన ముందుకు రాబోతున్నారు అంటూ.వాళ్ళు ఎవరికి వాళ్ళే గొప్ప వాళ్ళు అని.సూపర్ హీరోస్ స్క్రీన్ చూడటానికి ఆసక్తిగా ఉందని తెలిపింది.ఇక ఈ సినిమాలో పదిమంది సూపర్ హీరోస్ నటించారు.