మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ప్రెసెంట్ RC15 అనే వర్కింగ్ టైటిల్ పెట్టి తెరకెక్కించ బోతున్నారు.
ఈ సినిమా ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ పూణే లో స్టార్ట్ చేసారు.ఈ సినిమాలో కియారా అద్వానీ రామ్ చరణ్ కు జోడీగా నటిస్తుంది.
ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమా నుండి ఈ చిన్న అప్డేట్ వచ్చిన వైరల్ అవుతూనే ఉంది.
ఇక తాజాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు విలన్ దొరికేసాడంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాలో విలన్ కోసం శంకర్ మలయాళ స్టార్ నటుడిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
మలయాళ నటుడు సురేష్ గోపి ఈ సినిమాలో విలన్ గా కనిపించ బోతున్నాడట.
ఆయన పాత్ర నచ్చడంతో ఈ సినిమాలో విలన్ గా చేసేందుకు ఒప్పుకున్నాడని సమాచారం.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా కూడా నెగిటివ్ రోల్ లోనే నటిస్తున్నట్టు టాక్.ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి శంకర్ అన్ని ఇండస్ట్రీల నుండి నటులను ఎంపిక చేసుకుంటున్నాడు.
ఇక ఈ సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రెసెంట్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమాలో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను రాజమౌళి వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.
ఈ సినిమాతో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు.అందుకే చరణ్ తర్వాత సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.