యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 35వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఎన్టీఆర్ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా డిసెంబర్ నెలలో పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఒక పౌరాణిక చిత్రాన్ని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాకు ‘జై బావ్ రే’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చిత్రం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.