టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పూరి జగన్నాథ్ తొలిసారిగా బద్రి సినిమాకు దర్శకత్వం వహించారు.
పూరి జగన్నాథ్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు నిర్మాత రచయిత కూడా.టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నా పూరి జగన్నాథ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు.
తాజాగా పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ సినిమాను రూపొందించారు.
ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆకాష్ పూరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలోనే తన సోదరి పవిత్ర టాలీవుడ్ ఎంట్రీ గురించి రియాక్ట్ అయ్యాడు.
త్వరలోనే తన సోదరి పవిత్ర కూడా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న క్లారిటీ ఇచ్చారు.బుజ్జిగాడు సినిమాలో పవిత్ర చిన్నప్పటి త్రిష పాత్రలో కనిపించింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమె నటిగా వెండితెరపై కనిపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.తన సోదరికి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని తెలిపారు ఆకాష్ పూరి.బుజ్జిగాడు సినిమా టైంలో తన చెల్లి తనతో ఆ విషయం చెప్పిందని, కానీ నాన్నగారి సపోర్ట్ వల్లనే ఆ సినిమాలో నటించిందని తెలిపారు.కాకపోతే తన చెల్లికి నిర్మాణ రంగంలోకి రావాలని ఎంతో ఆశగా ఉన్నట్లు ఆకాష్ పూరి తెలిపారు.