టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నాగ చైతన్య నుండి బ్రేకప్ అయిన విషయం తెల్సిందే.ఇద్దరు కూడా పూర్తి మద్దతు అంగీకారంతో విడి పోయేందుకు నిర్ణయం తీసుకున్నారు.
సుదీర్ఘం గా ఆలోచించిన తర్వాత విడి పోతేనే ఇద్దరం సంతోషంగా ఉంటామనే నిర్ణయానికి వచ్చి వారు ఇద్దరు కూడా పెద్దల సమక్షంలో విడి పోయేందుకు సిద్దం అయ్యారు.ఎంత ఇష్టపూర్తిగా విడిపోయేందుకు సిద్దం అయినా కూడా మనసుకు కాస్త ఇబ్బందిగా కష్టంగా అనిపించడం చాలా కామన్ విషయం.
సమంత కూడా ఇప్పుడు మనసుకు కలిగిన బాధను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.అందుకే ఎప్పుడు లేనిది ఆద్యాత్మిక విహార యాత్రలకు వెళ్లడంతో పాటు అలవాటు లేని పనులు ఎప్పుడు చేయని పనులు ఆమె చేస్తూ అందరికి షాకింగ్ గా అనిపిస్తుంది.
తాజాగా ఆధ్యాత్మిక యాత్రను ముగించుకుని మళ్లీ చెన్నై కు చేరిన సమంత తన ఇంట్లో కాస్త ఆట విడుపు అన్నట్లుగా కుటుంబ సభ్యులతో కలిసి హాయిగా సమయాన్ని గడిపింది.ఇక ఆమె తనకు ఇష్టమైన పెయింటింగ్ ను కూడా వేసి అందరి దృష్టిని ఆకర్షించింది.వాల్ పెయింటింగ్ మాదిరిగా చాలా కలర్ ఫుల్ గా మోడ్రన్ ఆర్ట్ ను వేసిన సమంత రంగుల మద్య మరింత కలర్ ఫుల్ గా కనిపిస్తుంది.ఈ కలర్స్ మాదిరిగానే ఆమె జీవితం కూడా ముందు ముందు మరింత రంగుల మయం అవ్వాలని.
మరిన్ని సినిమా లను సమంత చేస్తే మేము చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు.ముందు ముందు సమంత టాలీవుడ్.కోలీవుడ్.బాలీవుడ్ సినిమా లు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకోవాలి.
ఇటీవలే హిందీ మరియు తమిళం లో రెండు భాషలను కమిట్ అయ్యింది.ఇక తెలుగు లో నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.