తెలుగు బుల్లితెరపై యాంకర్ గా, కమెడియన్, గా, ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అదేవిధంగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న ప్రియా హౌస్ లో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే.
ఇకపోతే సంచలన నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఏ మాట మాట్లాడిన అది తీవ్ర వివాదం సృష్టిస్తుంది.ఇలా ఈ ముగ్గురు విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా ఈ ముగ్గురు కలిసి దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ క్రమంలోనే ఈ ఫోటో చూసిన నెటిజన్లు అసలు ఈ ఫోటో ఎక్కడిది? ఈ ముగ్గురు కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా.? లేక ఏదైనా స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్నరా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ఇలా సుడిగాలి సుదీర్ వీరితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అసలు ఈ ముగ్గురు ఎందుకు కలిశారు అనే విషయంపై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఫోటోపై శ్రీ రెడ్డి స్పందిస్తూ అసలు విషయం బయట పెట్టారు.
వారు ప్రస్తుతం ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, ఏ సినిమాలోనూ నటించలేదని క్లారిటీ ఇచ్చారు.గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఏవో కుల సంఘాల వాళ్ళు మీటింగ్ పెడితే ఆ కార్యక్రమానికి హాజరైనట్లు గుర్తుందని, ఆ సమయంలో మేము ముగ్గురం కలిసి ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చామని ఈ సందర్భంగా శ్రీ రెడ్డి చెప్పుకొచ్చారు.అయితే ఈ నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ కావడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఇందులో ఉన్నటువంటి ప్రియా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.