ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి… ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఏకవచనంతో.విమర్శలు చేయటం తెలిసిందే.
దీంతో పట్టాభి పై కేసు నమోదు కావడం మాత్రమే కాక ఆయనను జైల్లో కూడా పెట్టడం జరిగింది.ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన పట్టాభి… కుటుంబంతో మాల్దీవుల పర్యటన లో ప్రస్తుతం ఉన్నారు.
ఇలా ఉంటే తాజాగా మరో తెలుగుదేశం పార్టీ కీలక నేత పై కేసు నమోదు చేయడం జరిగింది.
విషయంలోకి వెళ్తే టిడిపి ప్రధాన కార్యాలయం పై పార్టీ కీలక నేతల పై జరిగిన దాడిని నిరసిస్తూ.చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కార్యక్రమంలో..
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా.సీఎం జగన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పై కేసు నమోదు అయింది.
అంతకుముందు పట్టాభి చేసిన వ్యాఖ్యలనే మళ్లీ బోండా ఉమ దీక్ష సమయంలో… మళ్లీ రిపీట్ చేయటంతో గుంటూరులో వైసీపీ నేతలు పోలీస్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.పట్టాభి అన్నట్టే రాష్ట్రంలో పేద వర్గాలు కూడా జగన్ పరిపాలన ఉద్దేశించి బోసిడికే పరిపాలన మాదిరిగా ఉందని అంటున్నట్లు చంద్రబాబు దీక్ష సమయంలో బోండా ఉమా ఈ కామెంట్ చేయడం జరిగింది.
దీంతో బోండా ఉమ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.గుంటూరు వైసీపీ నాయకులు పోలీస్ ఫిర్యాదు చేయడంతో బోండా ఉమా పై కేసు నమోదయింది.