ఇటీవల వైసీపీ ప్రభుత్వం పై..
ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టిడిపి నేత పట్టాభి అరెస్ట్ అవటం ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇవ్వడం తెలిసిందే.ఈ నేపథ్యంలో జైల్ నుండి విడుదలైన తర్వాత వెంటనే కుటుంబంతో కలిసి ఆయన మాల్దీవుల పర్యటన చేపట్టారు.
ఈ క్రమంలో పట్టాభి మాల్దీవులు వెళ్ళటం పట్ల…ఏపీ రాజకీయాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
దీంతో తన తాజా మాల్దీవుల పర్యటన పై పట్టాభి క్లారిటీ ఇచ్చారు.తన ఇంటి పై దాడి జరగడంతో కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి.మాల్దీవుల పర్యటన చేపట్టినట్లు పట్టాభి క్లారిటీ ఇచ్చారు.
ఇంటి పై దాడి చేసిన తరుణంలో తన బిడ్డ ఎంతగానో భయపడిపోయింది… బాధ్యత గల తండ్రిగా గాయపడిన బిడ్డ మనసు రూపుమాపడానికి.మాల్దీవుల పర్యటన.చేపట్టడం జరిగిందని అనవసరంగా రాజకీయ విమర్శలు చేయొద్దని.పట్టాభి సూచించారు.
పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో డ్రగ్స్ పై చేపట్టిన పోరాటంలో పాల్గొంటా అని పట్టాభి క్లారిటీ ఇచ్చారు.