మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు నటుడిగా మంచి గుర్తింపుతో పాటు ప్రేక్షకుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అయితే సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం ఏ విధంగా ఉందనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.
ఇప్పటివరకు విడుదల చేసిన ఫోటోలలో సాయిధరమ్ తేజ్ ముఖాన్ని చూపించకపోవడం వల్ల కొంతమంది అనేక అనుమానాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం సాయిధరమ్ తేజ్ దాదాపుగా కోలుకున్నారు.
అయితే సాయిధరమ్ తేజ్ సన్నగా అయ్యారని ఫిజిక్ మాత్రం భారీగా తగ్గిపోయిందని తెలుస్తోంది.ఈ కారణం వల్లే సాయిధరమ్ తేజ్ ఫోటోలను మీడియాకు లీక్ చేయడం లేదని సమాచారం.
సాయిధరమ్ తేజ్ ముఖంపై ఎలాంటి మచ్చలు లేవని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.సాయితేజ్ ముఖంపై ఎటువంటి గాయాలు కూడా లేవని సమాచారం.
ప్రతిరోజూ ఒకరు లేదా ఇద్దరు సన్నిహితులు, బంధువులను సాయిధరమ్ తేజ్ కలిసి మాట్లాడుతున్నారని సమాచారం.అయితే సాయిధరమ్ తేజ్ మాట మాత్రం తడబడుతోందని తెలుస్తోంది.మరికొన్ని రోజుల్లో ఈ సమస్య కూడా తీరే అవకాశం ఉందని సమాచారం.పగలు, సాయంత్రం వేళల్లో సాయిధరమ్ తేజ్ ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
అయితే సాయిధరమ్ తేజ్ ఇప్పట్లో షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.వచ్చే ఏడాది నుంచి సాయిధరమ్ తేజ్ సినిమా షూటింగ్ లతో బిజీ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం.వరుస విజయాలతో జోరుమీదున్న సాయిధరమ్ తేజ్ కు రిపబ్లిక్ సినిమా ఫలితం షాకిచ్చింది.సీరియస్ గా సాగే సినిమా కావడంతో రిపబ్లిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించడంలో ఫెయిల్ అయిందని చెప్పాలి.
సాయితేజ్ కమర్షియల్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.