భూమి గురించిన విషయాలు వింటే చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాకా ఎంతో ఆసక్తిగా విటారు.ఇది వరకు రోజుల్లో భూమి ఎలా ఉంటుందంటే బల్లపరుపు గా ఉంటుందని మన పెద్ద వారు నమ్మేవారు.
ఈ విషయమే చాలా కాలం ప్రజలు నిజమనుకుని నమ్ముతూ వచ్చారు.అయితే భూమి బల్లపరుపుగా ఉండదని శాస్త్రవేత్తలు ఆధారాలతో సహా నిరూపించారు.
అయితే భూమి గోళాకారంగా ఉంటుంది అనే నిజాన్ని నమ్మడానికి ప్రజలకు చాలా కాలం పట్టింది.ఇప్పుడు శాస్త్రవేత్తలకు స్వేచ్ఛ ఉంది.వారు ఏది చెప్పిన ఆధారాలతో చూపిస్తే మనం నమ్ముతాము.కానీ పాతకాలంలో శాస్త్రవేత్తలకు గడ్డుకాలం ఉండేది.
అప్పట్లో పెద్దవారు భూమి బల్లపరుపుగానే ఉంటుందని నమ్మేవారు.కాదు గోళాకారంగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబితే అలంటి వారిని చంపిన రోజులు కూడా ఉన్నాయి.
ఆధారాలు ఉన్న కూడా నమ్మలేక పోయేవారు.ఇక 1900 సంవత్సరం నుండి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫొటోగ్రఫీ కూడా అందుబాటులోకి వచ్చింది.
అయితే మొదటిసారి భూమిని ఫోటో తీసి ప్రజలకు చూపించింది ఎవరో తెలుసా.అసలు ఆ ఫోటో ఎలా వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో ఏమైనా తెలుసా? 1946లో మొదటి సారి భూమిని ఫోటో రూపంలో తీసుకు వచ్చారు.
జర్మనీకి చెందిన నాజీ రాకెట్ వీ2 భూమి నుండి 105 కిలోమీటర్ల ఎత్తులో నుండి ఫోటోలు తీసింది.దీంతో మొదటిసారి స్పేస్ నుండి ఫోటో తీసిన మొదటి ఫోటోగా ఆ ఫొటో చరిత్రలో నిలిచి పోయింది.అయితే మొదటి సారి ఫోటో తీయడానికి చాలా కష్టపడినా ఆ తర్వాత ఇప్పటి వారికి 9 లక్షలకు పైగానే భూమి ఫోటోలను రాకెట్ల ద్వారా, అంతరిక్షం ద్వారా తీశారు.ఇదండీ.
తెలుసు కున్నారుగా భూమి మొదటి ఫోటోను ఎవరు, ఎప్పుడు తీశారో.