భారతీయ నటుడిగా, నిర్మాతగా సైఫ్ అలీ ఖాన్ ప్రేక్షకులకు సుపరిచితమనే సంగతి తెలిసిందే.మొదట అమృతా సింగ్ ను వివాహం చేసుకున్న సైఫ్ అలీ ఖాన్ 2004 సంవత్సరంలో ఆమెతో విడాకులు తీసుకున్నారు.
ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నారు.ఈ స్టార్ హీరో ఆస్తుల విలువ ఏకంగా 500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
అయితే అన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఈ హీరో పిల్లలకు మాత్రం డబ్బులు ఇవ్వలేడు.
ఈ స్టార్ హీరో పిల్లలు జహంగీర్ అలీఖాన్, సారా అలీఖాన్, తైమూర్ అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ కాగా సైఫ్ అలీఖాన్ ఫ్యామిలీ దేశంలో సంపన్న కుటుంబాలలో ఒకటని చెప్పవచ్చు.
సైఫ్ అలీఖాన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కాగా సైఫ్ అలీఖాన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ కుమారుడు కావడం గమనార్హం.అయితే సైఫ్ అలీఖాన్ తాతల నుంచి సంపాదించుకున్న ఆస్తులన్నీ భారత ప్రభుత్వం యొక్క వివాదాస్పద ఎనిమీ డిస్ ప్యూట్స్ యాక్ట్ కిందకు వస్తాయని సమాచారం.
అందువల్ల ఈ ఆస్తులను చట్టపరంగా సైఫ్ అలీఖాన్ లేదా అతని వారసులు క్లెయిమ్ చేయడం సాధ్యపడదు.
సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విషయంలో చాలా గందరగోళం నెలకొనడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది.సైఫ్ అలీ ఖాన్ ముత్తాత హమీదుల్లా ఖాన్ తన ఆస్తులకు సంబంధించి ఎటువంటి వీలునామా రాయలేదు.సైఫ్ అలీఖాన్ తాతయ్య సోదరి వారసుల వల్ల ఈ ఆస్తులకు సంబంధించిన వివాదం తలెత్తిందని సమాచారం.
సైఫ్ అలీ ఖాన్ తన మొదటి భార్య పిల్లలకు, రెండో భార్య పిల్లలకు ఆస్తులను బదిలీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.సైఫ్ అలీ ఖాన్ పరిస్థితిని చూసి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.సైఫ్ లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.