టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తన అందం, నటన అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల హృదయాలను దోచుకుంది.
అతి తక్కువ సమయంలో సినిమాలలో అవకాశాలు అందుకుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో బాగా బిజీగా ఉంది.ఇదిలా ఉంటే తన రియల్ రొమాన్స్ గురించి ఓ కామెంట్ చేసింది.
2005లో తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో పరిచయమైంది తమన్నా.ఈ సినిమా తరువాత హ్యాపీ డేస్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈ సినిమా తరువాత వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో నటించి అక్కడ కూడా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక తమన్నా చాలావరకు రొమాంటిక్ సీన్స్ లలో కూడా బాగా రెచ్చిపోయింది.ఇక తను ఆవారా సినిమాలో తమిళ హీరో కార్తీ సరసన నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమాలో వీరి మధ్య రొమాంటిక్ సీన్స్ ఎంతలా హాట్ టాపిక్ గా మారిందో చూసాం.నిజానికి ఒక సినిమాలో హీరో హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉంటే అందులో వాళ్ళు నటించడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.
కొందరు హీరో హీరోయిన్స్ మధ్య మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇదివరకే తమ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లుగా నటిస్తుంటారు.అలా తమన్నా కూడా ఆ సినిమాలో కార్తీతో అంతే కెమిస్ట్రీ గా మూవ్ అవ్వడంతో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో బాగా మాట్లాడుకున్నారు.
ఈ సినిమాలో వీరి మధ్య ఇంత కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అంటే నిజ జీవితంలో ఎంతలా డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తుంటారో అని బాగా ప్రశ్నలు ఎదురయ్యాయి.
దీంతో అప్పట్లో ఈ వార్త బాగా హాట్ టాపిక్ గా మారడంతో వెంటనే తమన్నా స్పందించింది.అవును.ఈ వార్తలు తన వరకు వచ్చాయి అంటూ నిజానికి సోషల్ మీడియాలో ఇటువంటివి చదువుకుంటూ ఎంజాయ్ చేస్తానని తెలిపింది.
సినిమా కథ వల్ల చేయాల్సి వచ్చిందని అంతే తప్ప రొమాంటిక్ సీన్ లలో తమ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడానికి ఎక్స్ స్ట్రా వర్క్ చేయలేదు అని తెలిపింది.
ఇక తనకు, కార్తికి మధ్య ఎటువంటి ఎఫైర్ లేదని అదంతా పుకారే అని తెలిపింది.
అంతేకాకుండా తర్వాత సినిమాలో కూడా ఇద్దరం కలిసి నటిస్తున్నామని తెలిపింది.ఇక తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది.గుర్తుందా శీతాకాలం సినిమాలో కూడా బిజీగా ఉంది.
మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.