నాగచైతన్యతో సమంత విడాకులు ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే గత జ్ఞాపకాలు అన్నింటిని మర్చిపోవడం కోసం సమంత తన స్నేహితురాలితో కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయింది.
ఈ క్రమంలోనే ఆ విషయాలన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ వచ్చారు.ఇదిలా ఉండగా సమంత తాజాగా మరొక పోస్ట్ చేశారు.
అయితే ఇన్ని రోజులు ఆధ్యాత్మిక ప్రదేశాలకి వెళ్లిన సమంత నిన్న ఇంట్లో కూర్చొని ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ను చూస్తూ ఆనందించారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతా పాకిస్థాన్ క్రికెటర్లు ఇండియన్ క్రికెటర్ మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఫోటోలు ఎంతో బ్యూటిఫుల్ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలను షేర్ చేయడమే కాకుండా మరొక ఫోటోని షేర్ చేస్తూ గుండె ముక్కలయింది అంటూ ఎమోజినీ షేర్ చేశారు.హాలీవుడ్ ఫేమస్ నటుడు జేమ్స్ మైఖేల్ టేలర్ ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడి మృతి చెందడంతో ఆయన మృతి చెందిన వార్తను తెలుసుకున్న సమంతా ఈ విధంగా సోషల్ మీడియాలో నో అంటూ గుండె ముక్కలైనటువంటి ఎమోజి షేర్ చేశారు.