నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటిటి లో అడుగు పెట్టనున్న విషయం విదితమే.తెలుగు ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా‘ లో బాలకృష్ణ ఒక టాక్ షో చేయబోతున్న విషయం అందరికి తెలుసు.
‘అన్ స్టాపబుల్ విత్ NBK’ పేరుతొ నవంబర్ 4 నుండి ఆహాలో బాలయ్య టాక్ షో మొదలు కాబోతుంది.ఇక ఈ ప్రోగ్రాం కి జాంబీ రెడ్డి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ షోలో గెస్టులుగా పాల్గొనే ప్రముఖుల పేర్లు చాలా మంది వినిపించిన మొదటి గెస్ట్ ఎవరై ఉంటారా అని అందరు ఎప్పటి నుండో చర్చించు కుంటున్నారు.ఫస్ట్ గెస్ట్ గా చిరంజీవి వస్తున్నారని ప్రచారం జరిగింది.కానీ అందులో నిజం లేదు.ఈ ప్రోగ్రాం ఫస్ట్ గెస్ట్ గా మోహన్ బాబు హాజరయినట్టు తెలుస్తుంది.తాజాగా ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.
మోహన్ బాబును ఇంటర్వ్యూ చేసిన తర్వాత బాలయ్య, మోహన్ బాబు కలిసి ఫోటోలు దిగారు.
ప్రెసెంట్ ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈ ఎపిసోడ్ బాగా వచ్చిందని చెప్పుకుంటున్నారు.
ఫుల్ ఫన్ గా వచ్చిందని, బాలయ్య కూడా సెట్ లో చాలా సరదాగా ఉన్నాడని చెబుతున్నారు.బాలయ్య ఎప్పుడు ఫైర్ అవుతూనే ఉంటాడు.
అలాంటిది ఈ ఇంటర్వ్యూ మొత్తం శాంతంగా ఉన్నాడా.లేదంటే ఏ సందర్భంలో అయినా సీరియస్ అయ్యాడా అని ప్రేక్షకులు ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే.ప్రెసెంట్ బాలయ్య అఖండ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసాడు.ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కించాడు.ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.ఇక ఈ సినిమా తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.