సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న ప్రత్యేకతే వేరు అని చెప్పవచ్చు.ఇక ఈ కుటుంబం నుంచి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక వీరికి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికి తెలిసిందే.మామూలుగా వీరిద్దరూ ఏదైనా స్టేజిపై కనిపిస్తే ప్రేక్షకులు ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో తెలిసిందే.
అదే ఇద్దరూ కలిసి ఒకే స్టేజి పై కనిపిస్తే ఇక ప్రేక్షకులకు పండగే పండగ.
తాజాగా పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిసి ఒకే స్టేజ్ కనిపించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ కొడుకు పెళ్లి కి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.అక్కడ వారిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్, చిరంజీవి ఒకే ఫ్రేమ్లో కనబడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.వీరిద్దరూ కలిసి ఆ వేదికపై ఉంటే ఆ సందడే వేరు.అలాగే వీరిద్దరూ కలిసే సందర్భాలు చాలా వేరుగా ఉంటాయి.
అలా కొన్ని సందర్భాలలో కలిశారు అంటే అది ప్రేక్షకులకు ఇటు అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.ఇక సాయి ధరమ్ తేజ్ ఫ్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్నే రేపాయో అందరికీ తెలిసిందే.
అప్పట్లో చిరంజీవి ఏపీ సీఎం వై.ఎస్.జగన్ను కలవబోతున్నట్లు వార్తలు వినిపించాయి.ఎప్పుడైతే జగన్కు వ్యతిరేకంగా పవన్ మాట్లాడారో మెగా బ్రదర్స్ మధ్య దూరం పెరిగినట్లు వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి.