బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలో సక్సెస్ కావడం తేలిక కాకపోయినా సమంత మాత్రం తొలి మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హాజరు కాగా ఆ సమయంలో సమంత ముఖంలో గ్లో లేదని కామెంట్లు వినిపించాయి.
విడాకుల ప్రకటన తర్వాత సమంత బాధ పడుతూనే ఉన్నారు తప్ప సంతోషంగా లేరు.అయితే ప్రస్తుతం సమంత తన ప్రియమైన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి అధ్యాత్మిక యాత్ర చేస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించిన సమంత మునుపటి అందంతో పాటు మునుపటి గ్లోతో కనిపిస్తున్నారు.మునుపటి ఉత్సాహంతో సమంత కనిపించడంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు.
మొహంలో ఏ బాధ లేనట్టుగా సమంత తనను తాను సర్వైవ్ చేసుకుంటూ ఉండటం గమనార్హం.
సమంత భవిష్యత్తు ప్రాజెక్టులు తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కనున్నాయి.వరుసగా సినిమాలపై కూడా దృష్టి పెడుతూ సమంత కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.సమంత నటించిన శాకుంతలం విడుదలకు సిద్ధంగా ఉంది.
సమంత బాలీవుడ్ పై కూడా దృష్టి పెట్టారని భారీ ప్రాజెక్టులలో నటించే దిశగా సమంత అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆమెకు మార్కెట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
కెరీర్ కు సంబంధించి సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సమంత ఒక్కో సినిమాకు ప్రస్తుతం 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.
బాలీవుడ్ సినిమాలకు మాత్రం సమంత ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.