మాటల తూటాలు, కౌంటర్లు, రీ కౌంటర్లతో హుజూరాబాద్ గడ్డ అట్టుడికిపోతోంది.నువ్వు అంత అంటానా నేను ఇంత అంటాను అన్న రేంజ్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు నానా తంటాలు పడుతున్నాయి పార్టీలు.
అయితే ప్రతి పార్టీకి కూడా ఓ సాంప్రదాయం ఉంటుంది.అదేంటంటే ఏ ఎన్నిక ప్రచారం అయినా సరే ఎక్కువ జనాభాను తరలించాలి.
లేదంటే తమకు జనాల్లో ఆదరణ కరువైందనే భావన ఏర్పడుతుందని అన్ని పార్టీలు కూడా డబ్బులిచ్చి మరీ జనాలను తరలిస్తుంటాయి.
ఈ విషయం అందరికీ తెలిసిందే.
మరి అత్యంత ప్రాధాన్యమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జనాలు లేకుంటే తమ పరువు పోతుందని భావిస్తున్నారు నేతలు.అందుకే గ్రామాల్లో ప్రచారం కోసం అందరూ మహిళా కూలీలను రప్పిస్తున్నారు.
హుజూరాబాద్ లో ప్రస్తుతం వ్యవసాయ కూలీ పనులు పెద్దగా నడవట్లేదు.దీంతో కొరత ఏర్పడింది.
దీన్ని అవకాశంగా మలుచుకున్న పార్టీలు వారికి పని కల్పించేందుకు తమ ప్రచారానికి రప్పిస్తున్నారు.చాలా గ్రామాల నుంచి కూలీ పనికి వెళ్లే వారంతా ఇప్పుడు ప్రచారాల బాట పడుతున్నారు.
కాగా వీరిఇక పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా ఎండలో పనిచేస్తే కేవలం రూ.300 వరకు వచ్చేవని కానీ ఇప్పుడు ప్రచారానికి ఏ పార్టీ తరఫున వెల్లినా సరే అంతకంటే ఎక్కువే ఇస్తున్నారంటూ చెబుతున్నారు కూలీలు.అయితే పొద్దున ఒక పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తే సాయంత్రానికి ఇంకో అభ్యర్థి తరఫున ఓట్లు అడుగేందుకు వెళ్తున్నామంటున్నారు.
దీతో ఈ కూలీలకు విరీతంగా డిమాండ్ పెరిగిపోయిందని తెలుస్తోంది.దాదాపు రూ.500 నుంచి రూ.600 దాకా ఇస్తున్నారని అందుకే పనులు లేని వారంతా ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నట్టు చెబుతున్నారు.ఇలా అన్ని పార్టీలు ప్రచారాలకు కూలీలతోనే వెళ్లదీస్తున్నాయి.