తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు రేవంత్ రెడ్డి. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేవంత్ ఎల్లప్పుడూ సంచలన ఆరోపణలతో రాజకీయాలను హీటెక్కిస్తాడన్న విషయం మనకు విదితమే.
తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది.ప్రస్తుతం కాంగ్రెస్ కు హుజూరాబాద్ లో గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నా ప్రచారాన్ని మాత్రం తగ్గించని పరిస్థితి ఉంది.
ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరువాత అంతటి బలమైన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ మాత్రమే.
అందుకే ఎన్నికలో గెలుపొందకున్నా తమకు ఉన్న క్యాడర్ ను బలాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతున్న పరిస్థితి ఉంది.
ప్రస్తుతం కాంగ్రెస్ గట్టిగా పోరాడి ఉంటే బీజేపీని మూడో స్థానానికి నెట్టి ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎందుకంటే బీజేపీకి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో డిపాజిట్ లు గల్లంతైన పరిస్థితి ఉంది.
దీనిని బట్టి చూస్తే హుజూరాబాద్ లో బీజేపీ ఏ మాత్రం బలంగా ఉన్నదనేది మనం అర్థం చేసుకోవచ్చు.కాంగ్రెస్ మాత్రం ఈటెల రాజేందర్ ను ఓడిస్తుందా అన్న రీతిలో హోరాహోరీ పోరు జరిగింది.
కానీ ప్రస్తుతం పరిస్థితులు మాత్రం అప్పటి పరిస్థితులకు పూర్తి భిన్నంగా మారిపోయిన పరిస్థితి ఉంది.కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ ఓటమిని కోరుకుంటుండటంతో అంతర్గతంగా బీజేపీకి మద్దతిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రేవంత్ లేవనెత్తినప్పటికి పెద్దగా టీఆర్ఎస్ నుండి రేవంత్ కు కౌంటర్ రాలేదు.ఎందుకంటే మొన్న ఈటెల- రేవంత్ కలయికపై కెటీఆర్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆక్రమలలోనే రేవంత్ ఇటువంటి ఆరోపణలతో మీడియా ముందుకు వస్తాడన్నది టీఆర్ఎస్ నేతలు ఊహించిన పరిస్థితి ఉంది.