ఇష్టం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి శ్రియ.ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న శ్రియ 2018 సంవత్సరంలో రష్యన్ బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను పెళ్లాడింది.
అయితే ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సంవత్సరం పాటు ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రియ నిత్యం తన భర్తతో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.
అయితే ఇది వరకు తన భర్తని ఏ సినిమా ఈవెంట్ కి తీసుకురాని శ్రియ మొట్టమొదటిసారిగా తన భర్తతో కలిసి బుల్లి తెరపై జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ ఈ కార్యక్రమానికి వచ్చారు.ఇలా మొట్టమొదటిసారిగా శ్రీయ దంపతులు రావడంతో వీరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు.
ఇక వేదికపై శ్రేయ భర్త అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఇకపోతే యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ మీరిద్దరూ సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడతారు అని అడగగా అందుకు శ్రియ భర్త ఆండ్రూ శ్రీయ బుగ్గపై ముద్దు పెట్టగా శ్రియ మాత్రం అందరూ చూస్తుండగానే వేదికపై తన భర్తకు లిప్ లాక్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక శ్రియ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.