సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా 2022 సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటుందని తెలుస్తుంది.పరశురాం డైరక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
బ్యాంక్ స్కాం నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో మహేష్ మాస్ లుక్స్ ప్రేక్షకులను అలరిస్తాయని అంటున్నారు.ఇప్పటికే ఫస్ట్ లుక్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచాడు పరశురాం.
ఇక మహేష్ సర్కారు వారి పాట 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.అయితే పొంగల్ రేసులో ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యాం వస్తున్నాయి.వీరితో పాటుగా పవన్ భీమ్లా నాయక్ కూడా సంక్రాంతికి రెడీ అవుతున్నాడు.మరి ఈ సినిమాల మధ్య పోటీ ఎందుకు అనుకున్నారో ఏమో కాని మొత్తానికి పొంగల్ రేసు నుండి మహేష్ సర్కారు వారి పాట తప్పుకుందని అంటున్నారు.
జనవరి రిలీజ్ వాయిదా పడగా సర్కారు వారి పాట సినిమా సమ్మర్ టార్గెట్ గా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్న సర్కారు వారి పాట మ్యూజిక్ పరంగా కూడా హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.