ఈ నడుమ ఆన్లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం.మరీ ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ విషయంలోనే ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
చాలా వరకు ఒకటి ఆర్డర్ పెడితే మరొకటి రావడాన్ని కూడా చూస్తున్నాం.కొన్ని సార్లు చాలా విలువైన వస్తువులు ఆర్డర్ చేస్తే ఇటుకలు రావడం లేదంటే మామిడి పండ్లు రావడం లాంటివి కూడా చూస్తున్నాం.
కాగా ఇప్పుడు కూడా ఇలాటి ఓ విచిత్ర ఘటన జరిగింది.దీన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.
ఎందుకంటే ఆర్డర్ పెట్టిన దానికి డెలివరీ అయిన దానికి అసలు పొంతనే లేదు.
ఈ విచిత్ర అనుభవం కేరళలోని ఓ వ్యక్తికి ఎదురైంది.
ఈ రాష్ట్రంలోని కొచ్చి పట్టణ ప్రాంతంలోని అలువా ఏరియాకు చెందినటువంటి అమీన్ ఎంతో ఇష్టంగా ఆన్లైన్ షాపింగ్ చేసి అందులో ఐఫోన్ 12 ను కొనాలని అనుకున్నాడు.వెంటనే అనుకున్నట్టుగా అమెజాన్ యాప్లో రూ .70000 పెట్టి మరీ ఐఫోన్ బుక్ చేసుకున్నాడు.ఇక ఫోన్ ఆర్డర్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఓ రోజు వచ్చింది.
అయితే దాన్ని ఆతృతగా ఓపెన్ చేసిన అమీన్కు మైండ్ బ్లాంక్ అయిపోయింది.ఎందుకంటే అందులో డిష్ వాష్ సబ్బు ఉండడం చూసి తన కండ్లను తానే నమ్మలేకపోయాడు.
అందులో సబ్బుతో పాటు బోనస్ గా రూ.5 కూడా ఉండటంతో దాన్ని చూసిన అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు.వెంటనే దాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి తనుకు ఎదురైన అనుభవాన్ని వివరిచాడు.ఇంకేముంది దీన్ని చూసిన వారంతా కూడా ఓ రేంజ్లో కామెంట్లు పెట్టేస్తున్నారు.
ఇక దీనిపై నూరుల్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయగా వారు ఎంక్వయిరీ చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై అమేజాన్ స్పందించింది.
అమీన్ కు క్షమాపణలు చెప్పింది.ప్రస్తుతానికి స్టాక్ లేదు కాబట్టి సొమ్ము మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెల్లించింది.
.