వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని న్యాయస్థానంలో పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీబీఐ కోర్టులో పిటిషన్ వేయగా అక్కడ చుక్కెదురు కావడంతో తాజాగా సుప్రీంకోర్టు లో.
జగన్ కేసును త్వరగా విచారణ చేపట్టే రీతిలో నాయస్థానం చొరవ తీసుకోవాలని.పిటిషన్ వేశారు రఘురామకృష్ణంరాజు.
ఈ క్రమంలో మీడియాతో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.తన పిటిషన్ సుప్రీంకోర్టులో కొట్టేసే అవకాశాలు లేవని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా గతంలో జగన్ బెయిల్ రద్దు చేయాలని.ర రామకృష్ణంరాజు వేసిన పిటిషన్ పై.విచారణ చేపట్టిన న్యాయస్థానలు.జగన్ ఎక్కడా కూడా బెయిల్ షరతులు వెల్లడించలేదని వేసిన పిటిషన్ను కొట్టి పారేశారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టును రఘురామకృష్ణంరాజు ఆశ్రయిస్తూ పిటిషన్ను దాఖలు చేయడంతో.ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ముఖ్యంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ.ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల.విషయంలో సంవత్సరంలోగా విచారణ జరిపించాలని.గతంలోనే తెలియజేసిన నేపథ్యంలో.రఘురామ కృష్ణంరాజు పిటిషన్ పట్ల సుప్రీం కోర్టు ఏవిధంగా వ్యవహరిస్తుంది అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.