తన శిష్యరికమే బొమ్మరిల్లు భాస్కర్ గారికి వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్. కేవలం భాస్కర్ మాత్రమే కాదు సుకుమార్ కూడా తన దగ్గరికి అప్రెంటిస్ గా వచ్చిన కుర్రాడే అని ఆయన వివరించారు.
వాళ్ళిద్దరే కాదు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలామంది తన దగ్గర నుంచి వెళ్లిన వారే అని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.సుకుమార్ లాంటి దర్శకులు సినీ ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్లు తన పేరు తీసుకుని గర్వంగా చెప్తుంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, తన శిష్యులు ఇలాంటి విషయాలను ఎందుకంటే తనకు సంతోషమేనని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇక పోతే తాను ఎప్పుడూ రీమేక్ సినిమాలకు కూడా కాంప్రమైజ్ కానని మోహన్ తెలిపారు.ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఆంధ్ర భోజనం వేరు, తమిళనాడు భోజనం వేరు, కర్ణాటకలో చూస్తే అక్కడ స్వీట్ ఎక్కువగా తింటారు, కేరళ కి వెళ్తే అక్కడ భోజనమే వేరు, ఒక్క భోజనం విషయంలోనే ఇంత తేడా ఉంటే ఇక ఎంజాయ్మెంట్ విషయంలో ఎంత తేడా ఉంటుందో కదా అని ఆయన వివరించారు.
ఏరియాకు ఏరియాకు చాలా తేడా ఉంటుంది కదా అని ఆయన తెలిపారు.
కాబట్టి తాను తమిళంలో చేసేటప్పుడు తమిళులకు నచ్చేటట్టు చేయాలి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడి వాళ్లకు నచ్చేటట్టు చేయాలి.
ఇది మరచిపోయి చాలామంది రీమేక్ అంటే ఏదో అనుకుని సినిమాలు తీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.అది సరైన పద్ధతి కాదని చాలా తప్పు అని ఆయన వివరించారు ఇప్పటి వరకు తీసిన సినిమాలలో ఎంత వరకు హిట్ అయ్యాయని నిర్మాత మోహన్ ప్రశ్నించారు.తన సినిమాల్లో ఇప్పటి వరకు 100% ఫ్లాపులు అనేది లేవని ఆయన చెప్పారు.దానికి కారణం ఆ లాంగ్వేజ్, అక్కడి మనుషుల అభిరుచులను తెలుసుకొని చేయడమే అని వివరించారు.
అంటే ఆ ఏరియా మనుషులకు ఏదైతే నచ్చుతుంది ఏం చేస్తే నచ్చుతుందో తెలుసుకుని చేయడమే దానికి కారణం అని ఆయన చెప్పారు.